శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల 1 y ago
AP: భక్తుల సౌకర్యార్థం జూన్లో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన కోటాను మంగళవారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. ఎలక్ట్రానిక్ లక్కీడిప్ కోసం ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్ నమోదు చేసుకోవచ్చు. 21వ తేదీ ఉదయం 10 గంటలకు టికెట్లు విడుదల చేస్తారు. 22వ తేదీ ఉదయం అంగప్రదక్షిణం, శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం, ప్రత్యేక ప్రవేశ టోకెన్ల కోటాను 11 గంటల నుంచి ఉంచుతారు. 24న ఉదయం రూ.300 టికెట్లు విడుదల చేస్తారు.